మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు
- Vijaya Preetham
- Jan 1
- 1 min read
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు

భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రుల శాఖ సలహాదారుగా,ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఆర్బిఐ గవర్నర్ వివిధ హోదాలలో పనిచేసిన మన్మోహన్ సింగ్ చనిపోవడం దేశానికి తీరని లోటని ఇంగిలే రామారావు అన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, 1991, 2004లో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని తన నైపుణ్యం, పనితీరుతో గట్టెక్కించారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేశారన్నారు. విద్యాహక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 18 గ్రామాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Comments