మైనారిటీ బాలికల పాఠశాలలో గణితశాస్త్ర దినోత్సవ వేడుకలు
- medhalouise
- Dec 21, 2024
- 1 min read

వాస్తవం:
హుజురాబాద్
నేడు శ్రీనివాస రామాంజనేయుల జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకునే కార్యక్రమాన్ని ఇందిరానగర్ మైనారిటీ బాలికల పాఠశాల ( గర్ల్స్. 1) విద్యార్థులు శనివారం ముందస్తుగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు గణిత శాస్త్ర నైపుణ్యాన్ని ప్రధానోపాధ్యాయురాలు నదియా, కు ప్రదర్శించి వాటిపై వివరణలు ఇచ్చారు. ఇట్టి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నైపుణ్యాన్ని చాటుకున్న విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు ప్రిన్సిపల్ నదియా, కో-ఆర్డినేటర్ శ్రీవాణి, అశ్విని, గణిత ఉపాధ్యాయురాలు లావణ్య, సుస్మిత, హేమలత, పాఠశాల సిబ్బంది తదితరులు విద్యార్థులను అభినందించారు.

Comments